కాలం పరిపూర్ణమవడం

👉🏻క్రీ. పూ: 722 లో ఉత్తర రాజ్యం పై అష్షురీయులు దాడి చేసి 10 గోత్రాల వారిని చెరలోకి తీసుకుని వెళ్లారు..

👉🏻అప్పుడు ఉత్తర రాజ్యం నుండి కొందరు నలుదిశలా పారిపోయారు

👉🏻క్రీ.పూ 586 లో బబులోను వారు దక్షిణ రాజ్యము పై దాడి చేసి యూదులను చెరలోకి తీసుకుని వెళ్లారు.

👉🏻కానీ అప్పుడు కూడా కొందరు నలుదిశలా పారిపోయారు

👉🏻క్రీ.పూ 538 లో పారసికుల యుగం ప్రారంభమైంది. షుమారు 536 లో చెరలో ఉన్న వారు తిరిగి యూదయకు వచ్చారు కానీ చెదరిపోయిన వారు మాత్రం రాలేదు

👉🏻 క్రీ. పూ 332 లో పారసికుల యుగం ముగిసింది. అప్పుడు గ్రీకులు పుంజుకున్నారు

👉🏻పారశిక యుగం నాటికి యూదులు  సిరియా,అష్డోధు, అరమిక్ భాషలు నేర్చుకున్నారు

👉🏻 అయితే గ్రీకు యుగంలో ఒక పెనుమార్పు చోటుచేసుకుంది... అదేంటంటే
 గ్రీకు భాష ప్రపంచ అధికారిక భాషగా ప్రభళింది ప్రస్తుత ఇంగ్లీష్ భాష లాగా

👉🏻 చెరనుండి వచ్చిన వారిలో కొందరు హెబ్రీ భాష (ఇశ్రాయేలు మాతృభాష) రాని వారు కూడా ఉన్నారు.కారణం వారు ఇతర జాతి స్త్రీల ను వివాహం చేసుకున్నారు..

👉🏻అలా యూదుల్లో అష్డోధు భాష,అరమిక్ భాష  ప్రాబల్యం పొంది బహుశా యేసు క్రీస్తు వారు జన్మించిన టైం వరకు కొనసాగింది.

👉🏻అయితే గ్రీకులు యుగం లొనే షుమారు క్రీ. పూ 250 లో 70 మంది  కలిసి హెబ్రీ బాషలో ఉన్న పాతనిబంధన గ్రీకు లోకి తర్జుమా చేశారు..

దీనినే THE SEPTUOZANT అంటారు. దీన్ని LXXX  అనే గుర్తు లో సూచించారు..

👉🏻క్రీ.పూ 67 లో గ్రీకులు ప్రాధాన్యత తగ్గి మెల్లగా రోమియులు పుంజుకున్నారు

అయితే గ్రీకులకు రోమియులకు మధ్య సుమారు 100 సంవత్సరాల పాటు ప్రపంచం ఎవరి గుప్పిట్లోనూ లేదు.

👉🏻ఈ 100 సంవత్సరాల కాలంలో లోకల్ యుద్ధాలు బాగా జరిగాయి

👉🏻ఈ కాలంలోనే మక్కబీయుల పాత్ర మనకు కనిపిస్తుంది

👉🏻కాలక్రమంలో రోమియుల హస్తం యుదులపై హెచ్చయింది.

👉🏻అందుకే వారు(రోమియులు) 2వ హేర్కనేసు ను యూదయకు మరియు ఇదుమయకు రాజుగా ఏర్పాటు చేసారు.ఇతను ఒక ఎదోమీయుడు

👉🏻క్రీ.పూ. 63 నాటికి రోమియులకు పట్టు బాగా దొరికింది. కానీ అప్పటికే యూదులు ప్రపంచమంతా విస్తరించి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు

👉🏻స్సమాజ మందిరాలు కూడా ఈ కాలంలోనే ఎక్కువగా కట్టబడ్డాయి.

👉🏻ఈ కాలంలోనే రవాణా వ్యవస్థ కూడ ఆధునికీకరణ చేయబడింది

👉🏻యూదులు,ధర్మశాస్తo ఎరిగిన వారు ప్రపంచంలో అన్ని చోట్లా ఉన్న పరిస్తితులు మరియు,ఎటువంటి అల్లర్లు లేకుండా ఒక నిశ్శబ్దకరమైన వాతావరణం నెలకొన్న రోజులవి

👉🏻ఏ సమయం కోసము అయితే దేవుడు ఎదురుచూశాడో ఆ సమయం ఆసన్నమైందని ఎరిగిన దేవుడు
తన కుమారుని పంపాడు.

ఈ కాలంలో అయితేనే అందరికి రవాణా కానీ,భాషలు కానీ,ఎలాంటి అల్లర్లు లేని కాలం కావడం మూలంగా దేవుడు ఏదైతే అబ్రాహాము కి వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం నెరవేర్పు జరిగే అనుకూల వాతావరణం నెలకొంది

👉🏻అందుకే పెంతేకోస్తు పండుగలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుధులందరూ యెరూషలేము లోఉండగా జరిగిన విషయం

👇

 ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.


6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.


7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడిఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?


8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?


 *తూర్పు నుండి వచ్చిన వారు*
👇
9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ

 *ఉత్తరం నుండి వచ్చినవారు*
👇
యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ

 *దక్షిణము నుండి వచ్చిన వారు*
👇
ఐగుప్తు అను దేశములయందలి వారు,


10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు,

 *పడమర నుండి వచ్చిన వారు*

👉🏻రోమానుండి పరవాసులుగావచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,


11 క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.


12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.


13 కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి


ప్రపంచమంతటా యేసు  ద్వారా దేవుడు చేసిన కార్యం,

అబ్రాహాము కు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పులు,

సంఘ స్థాపన,మెస్సియా గూర్చిన పూర్తి స్థాయిలో వారికి (ప్రపంచమంత ఒకేసారి) ముందు యూదుల ద్వారా సువార్త వెళ్లే ఏర్పాటు...

ఇది కాలం పరిపూర్ణమవడం

Comments